పల్నాడు జిల్లా, అమరావతిలో కృష్ణానది ఒడ్డున, ధ్యాన బుద్ధ ప్రాంగణంలో యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది.. వేలాదిమంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.. కార్యక్రమంలో పలనాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారు, రాష్ట్ర ఎంపీపీల సంఘం అధ్యక్షులు అమరావతి ఎంపీపీ మేకల హనుమంతరావు గారు, DRDA PD గారు, DWAMA PD గారు, DEO గారు, RDO గారు , DPO గారు, DLPO గారు, పర్యాటక శాఖ అధికారులు, మండల తహసిల్దార్ డానియల్ గారు, ఎంపీడీవో పార్వతి గారు, పలువురు జిల్లా మరియు మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వెలుగు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.. ఎంపీపీ హనుమంతరావు గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగించాలన్నదే నరేంద్ర మోడీ గారి లక్ష్యమని తెలిపారు.. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుందని కొనియాడారు.. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రత్యేక చొరవ తీసుకుని యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యేలా కార్యాచరణ రూపొందించారని కొనియాడారు..

Share.
Leave A Reply