జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించడం
జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా రోడ్డు భద్రత కమిటీలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలు గతంలో కన్నా అధికంగా జరుగుతున్న కారణంగా వాటిని నివారించడానికి జిల్లా కలెక్టర్ గారు రవాణా శాఖ, పోలీస్ శాఖ వారిని జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించమని ఆదేశాలు జారీ చేయడం జరిగినది.
ఈ ఆదేశాల మేరకు తేది 18-06-2025 బుధవారం నాడు పోలీసు, రవాణా శాఖ మరియు R.T.C. అధికారులు చిలకలూరిపేట నుండి నరసరావుపేట వెళ్ళు రహదారిలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీలలో భాగంగా ఇన్సూరెన్సు సర్టిఫికెట్ , పొల్యూషన్ సర్టిఫికెట్ పన్ను చెల్లించని, మరియు హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనములు నడుపుచున్న వారి పై కేసులు నమోదు చేయడం జరిగినది. ఇందులో భాగంగా సుమారు 45 వాహనములు తనిఖీచేసి 13 వాహనములకు కేసులు నమోదు చేసినాము. ఇందులో ఇన్సూరెన్సు సర్టిఫికెట్ లేనివి 7, పొల్యూషన్ సర్టిఫికెట్ లేనివి 6, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేనివి 5, పర్మిట్ లేనివి ఒకటి Driving Licence లేనివి 9, వున్నాయి. అందులో 3 వాహనముల ను స్వాధీనము చేసుకుని భద్రత నిమిత్తము RTC స్థానిక డిపో నందు ఉంచాము. అపరాధ రుసుము రూపంగా 90820/- రూపాయలు వసూలు చేసినాము.
ఈ తనిఖీలలో చిలకలూరిపేట ఆర్టీసీ డి ఎం రాంబాబు గారు, పోలీస్ శాఖ వారు తరఫునుంచి సీ.ఐ మరియు ఎస్.ఐ, TRAFFIC పోలీసులు రవాణా శాఖ వారి తరఫునుంచి సహాయ తనిఖీ అధికారి K.L.RAO పాల్గొన్నారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని దీనివల్ల రోడ్లపై జరిగే ప్రమాదాలను నిర్మూలించవచ్చని తెలియపరచడమైనది.
ఇట్లు,
జి సంజీవ్ కుమార్
పల్నాడు జిల్లా రవాణాశాఖ అధికారి
Trending
- మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం
- చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది
- జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది
- పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం
- మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



