చిలకలూరిపేటలో వార్డుల్లో వీధిలైట్ల మరమ్మతులు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో చర్యలు
చిలకలూరిపేట పట్టణంలోని 29వ వార్డు పీర్ల మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధిలైట్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను, సంబంధిత వార్డు కౌన్సిలర్ను ఆదేశించారు. పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుకుగా వ్యవహరించి, పీర్ల మన్యం ప్రాంతంలోని వెలగని వీధిలైట్లన్నింటినీ గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలగని వీధిలైట్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతుల పనులు త్వరలో పూర్తవుతాయని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తెలిపారు
Trending
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి
- ప్రత్తిపాటి సమక్షంలో టీడీపీ గూటికి చేరిన వైసీపీ కార్యకర్తలు
- క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి : ప్రత్తిపాటి
- పల్నాడు జిల్లా కలెక్టర్కు జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు
- రాజ్యసభ సభ్యునిగా సాయినాథుని మొక్కులు చెల్లించుకున్నా: భాష్యం రామకృష్ణ
- పశుపోషణతో అదనపు ఆదాయం : ప్రత్తిపాటిరైతుల సహకారంతో సంగం వ్యవస్థను మరింత వృద్ధిలోకి తెస్తాం : దూళిపాళ్ల
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇంచార్జ్ డీఆర్ఓ గారికి రాష్ట్రంలో సెప్టిక్ ట్యాంకుల నుంచి సేకరిస్తున్న మానవ మలమూత్ర వ్యర్థాల తక్షణ చర్యలు తీసుకోవలసిందిగా జనతా వారధి తరపున వినతిపత్రం సమర్పణ
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్వాక్రా మహిళల సమస్యలపై జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ



