చిలకలూరిపేటలో వార్డుల్లో వీధిలైట్ల మరమ్మతులు: మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆదేశాలతో చర్యలు
చిలకలూరిపేట పట్టణంలోని 29వ వార్డు పీర్ల మన్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు వెలగని వీధిలైట్లను గుర్తించి, వాటికి మరమ్మతులు చేయిస్తున్నారు. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, చిలకలూరిపేట శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.మున్సిపల్ సిబ్బందితో కలిసి వెలగని లైట్లను గుర్తించిన కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, వెంటనే వాటిని రిపేరు చేయించేందుకు చర్యలు చేపట్టారు. వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడటం లేదా లైట్ల లోపాలు తలెత్తడం వల్ల పలుచోట్ల వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను, సంబంధిత వార్డు కౌన్సిలర్ను ఆదేశించారు. పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు, కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి చురుకుగా వ్యవహరించి, పీర్ల మన్యం ప్రాంతంలోని వెలగని వీధిలైట్లన్నింటినీ గుర్తించి, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తున్నారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి సమయాల్లో వెలగని వీధిలైట్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మరమ్మతుల పనులు త్వరలో పూర్తవుతాయని కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి తెలిపారు
Trending
- భోగిపండ్లు పోయడం వెనుక ఆచారం చాలా ఆసక్యంగా ఉంటుంది.
- వైసీపీ నేతలు దహనం చేయాల్సింది జీవోలు కాదు.. తమలోని విద్వేష లక్షణాలు.. వినాశనకర ఆలోచనల్ని: ప్రత్తిపాటి
- భోగి పండగ గురించి
- చిలకలూరిపేట అగ్ని హర్షిదాతు ఎం.ఎస్.ఎం.ఈ పార్కుకు ఆమోదం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా.
- బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు
- పల్నాడు జిల్లా…. జనతా వారిది కార్యక్రమంలో సమస్యలతో వచ్చిన బాధితులను తీసుకొని పరిష్కార దిశగా జిల్లా కలెక్టర్ కార్యాలయం లో అధికారులను కలవడం జరిగింది
- ఘనంగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన బిజెపి నాయకులు
- సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ కార్యక్రమాన్ని నిర్వహించిన చిలకలూరిపేట బిజెపి పార్టీ



