ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుని కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేత.
చిలకలూరిపేట, నాదెండ్ల మండలం, గణపవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశ్రీలక సభ్యుడు గజ్జ. శ్రీకాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అతడు జనసేన పార్టీ క్రియా శిలక సభ్యత్వం ఉండటం వలన పార్టీ నుండి ఐదు లక్షల ప్రమాద బీమా చెక్కును వారి కుటుంబ సభ్యులకు సోమవారం మంగళగిరిలోని ఆర్ ఆర్ ఆర్ ఫంక్షన్ హాల్ వేదికగా ఎమ్మెల్సీ శ్రీ కె .నాగబాబు గారు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ గారిని కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగ రాజా రమేష్ మాట్లాడుతూ దేశంలోనే రాజకీయ పార్టీల కార్యకర్తల బాగోగులు గురించి ఆలోచించే పార్టీ జనసేన అని అన్నారు. చనిపోయిన శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు పార్టీ తరఫున పూర్తిగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మండలనేని చరణ్ తేజ్, జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్. సుభాని, పఠాన్ ఖాదర్ బాషా, పాపన హనుమంతరావు, శరత్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Trending
- చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం
- మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గోవధ నిషేధ చట్టంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా పర్యటక అభివృద్ధి గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
- బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి



