పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు & వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ కొంజేటి నాగ శ్రీను రాయల్ గారు హాజరై జాబ్ మేళాను ప్రారంభించారు. రాష్ట్రంలో 20 లక్షల మందికి ఉద్యోగ,ఉపాధి కల్పన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ముందుకు వెళ్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగానే వినుకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించి వందలాదిమంది నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ ఉపాధి కల్పించడం జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిర్వహించే జాబు మేళ ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని చీఫ్ విప్ జీవి గారు కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
- మండల అధ్యక్షులు నల్లమోతు మాధవరావు ఆధ్వర్యంలో నాదెండ్ల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం
- చిలకలూరిపేట రూరల్ మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది
- జనతా వారధి ఫిర్యాదుకు తక్షణ స్పందన
- మండల ప్రశిక్షణ తరగతుల సన్నాహక సమావేశం చిలకలూరిపేట టౌన్ లో నిర్వహించడం జరిగింది
- పేదల సొంతింటి కల సాకారంతో వారి గౌరవం, భద్రతకు ప్రభుత్వం మద్ధతుగా నిలుస్తోంది : ప్రత్తిపాటి
- జనసేన సభ్యత్వ నమోదు మహోత్సవం
- మాచర్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
- పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది



