నాఓటు – నాహక్కు”
పేరుతో నూతన ఉద్యమం ప్రారంభిస్తున్నట్లు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు.ప్రజాస్వామ్యం ఓటు హక్కు అమ్మకంతో అపహాస్యం కాకూడదని భావించి మార్పుకోసం మరో మహోద్యమానికి నవతరం పార్టీ శ్రీకారం చుట్టిందని తెలిపారు.”ఇండియా అగైనెస్ట్ ఓట్ కరప్షన్”దిశగా ఉద్యమం నడిపిస్తామని,ఓటు హక్కును కొనుగోలు చేసే వస్తువుగా చూసే సంప్రదాయం మార్చేందుకు ప్రయత్నం చేయాలని నిర్ణయం తీసుకొని ఉద్యమం మొదలు పెట్టామని అన్నారు. ముందుగా విద్యార్థులు,యువకులకు ఓటు హక్కు అమ్మకం వల్ల జరుగుతున్న నష్టం వివరిస్తామని, వారి భాగస్వామ్యంతోనే ఉద్యమం ముందుకు తీసుకొని వెళతామని రావుసుబ్రహ్మణ్యం తెలిపారు.వచ్చే సార్వత్రిక ఎన్నికలు నాటికీ ఒక్క ఓటు కూడా అమ్మడం లేక కొనడానికి అవకాశం లేకుండా చేయడమే ఉద్యమం లక్ష్యం అని అన్నారు.ఓటుఅమ్మకం లేని నవ భారతావనిని సృష్టించడమే లక్ష్యం అన్నారు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే మార్పు సాధ్యమే అన్నారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నవతరం పార్టీ నుండి అందరి సహకారం ఆశిస్తున్నామన్నారు.

Share.
Leave A Reply