వినుకొండ : ప్రభుత్వ చీప్ విప్ మరియు వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశాల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సూచనలతో రాబోయే వర్షాభావ పరిస్థితులను దృష్టి నందు ఉంచుకొని పురపాలక సంఘ పరిధిలో ఎటువంటి వరదలు సంభవించకుండా, రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా నివారించేందుకు దుర్గం దాన్ని తొలగించుటకు, దోమల పెరుగుదలను అరికట్టేందుకు పట్టణ పరిధిలో ఉన్న అన్ని మేజర్ డ్రైనేజీలు డీసిల్టేషన్ చేయించవలసిందిగా నిర్ణయించి ఉన్నారు. దీనిలో భాగంగా బిపిఎస్ 2019 మరియు ఎల్ఆర్ఎస్ 2020 నియమాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం పట్టణానికి కేటాయించిన 44.59 లక్షల నిధులతో పలు విడతలుగా కాలువ పూడిక తీసివేత ప్రారంభించి ఉన్నారు. ఇందులో భాగంగా గత రెండు రోజులుగా పట్టణంలోని వివిధ వార్డుల యందు అనగా అంబేద్కర్ కాలనీ, శృంగారపు వనం, పల్నాడు రోడ్డు మెయిన్ డ్రైనేజీ, మార్కాపురం రోడ్డు మెయిన్ డ్రైన్ డబ్బా స్తంభం సెంటర్,కోట్నాల్స బజార్ మొదలగు ప్రాంతాల్లో డీసిల్టేషన్ పనులు మొదలుపెట్టి ఉన్నారు. ఈ పనులను మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ , మున్సిపల్ ఇంజనీర్ ఆదినారాయణ మరియు శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ తదితరులు పర్యవేక్షిస్తూ పట్టణ ప్రజలు మరియు వ్యాపారస్తులు డీసిల్టేషన్ చేసే సమయంలో డీసిల్టేషన్ సిబ్బందికి సహకరించాలని ఎటువంటి అడ్డంకులు ఉన్న తొలగించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది.
Trending
- చిలకలూరిపేట మండలం పోతవరం, మద్దిరాల గ్రామాల్లో విజయవంతంగా “రెండేళ్ల పాలన” కార్యక్రమం
- మున్సిపల్ కమిషనర్ గారి కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సంబంధించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో గోవధ నిషేధ చట్టంపై ఫిర్యాదు ఇవ్వడం జరిగింది
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పల్నాడు జిల్లా పర్యటక అభివృద్ధి గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది
- చిలకలూరిపేట పట్టణం 9వ వార్డులో ఘనంగా ప్రారంభమైన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం
- పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జనతా వారధి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
- బ్యాంకుల సహకారంతోనే సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. ప్రత్తిపాటి
- పేద విద్యార్థులకు నగదు పురస్కారాలు అందించిన ప్రత్తిపాటి



