చిలకలూరిపేట పాత గవర్నమెంట్ హాస్పిటల్ స్థలంలో ప్రభుత్వ తల్లి పిల్లల హాస్పిటల్ నిర్మించాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ పట్టణ సమితి ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం,, సభకు అధ్యక్షత వహించిన నాయుడు శివ కుమార్. పాల్గొన్న అఖిలపక్ష నేతలు. కార్యక్రమం ఉద్దేశించి రావు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పాత ప్రభుత్వ ఆసుపత్రి స్థలం సధ్వినియోగం చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం చేపట్టాలని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు,ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సంపూర్ణ సహకారం కోసం వారిని కలుస్తామని అన్నారు. ముఖ్యంగా 50 పడకల తల్లి పిల్లలు ఆసుపత్రికి అనుమతులు సాధించే దిశగా కమిటీ ఏర్పాటు చేసుకొని ముందుకు వెళదామన్నారు.తల్లి పిల్లల ఆసుపత్రి తో పాటుగా ట్రామా కేర్ యూనిట్,బ్లడ్ బ్యాంక్ సాధించే విషయంలో అఖిల పక్షం కృషి చేస్తుందన్నారు.
Trending
- మండలనేని సుబ్బారావు పుట్టినరోజు
- దత్త సాయి సన్నిధి లో విష్ణు సహస్ర నామ పారాయణ భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం —-
- డీఎస్సీ నియామకాలను వెంటనే చేపట్టాలి -ఎస్టీయూ
- ఆగస్ట్ 15 తర్వాత సంక్షేమం అమల్లో దేశంలో ఏపీనే టాప్ : ప్రత్తిపాటి.
- సోనా ప్రసాద్ చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు
- మర్రి శ్రీనాథ్ పుట్టినరోజు వేడుకలు
- జనసేన ఆధ్వర్యంలో పట్టణంలో 26వ వార్డులో వృద్ధురాలికి చేయూత
- యోగాంధ్రతో ప్రపంచ రికార్డు